TS News: ప్రజాస్వామ్యాన్ని కాపాడతారనే నమ్మకం ఉంది: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
ABN, First Publish Date - 2022-08-12T23:57:37+05:30
Nalgonda: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి (Ex MLA Komatireddy Raja Gopal Reddy) సీఎం కేసీఆర్ (CM KCR)పై విరుచుకుపడ్డారు. వ్యాపారం కోసం పార్టీ మారినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇంకా ఏమన్నారంటే..
Nalgonda: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి (Ex MLA Komatireddy Raja Gopal Reddy) సీఎం కేసీఆర్ (CM KCR)పై విరుచుకుపడ్డారు. వ్యాపారం కోసం పార్టీ మారినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇంకా ఏమన్నారంటే..
‘‘మునుగోడు ప్రజా సమస్యల కోసం మూడున్నరేళ్లుగా పోరాడుతున్నా. నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగబోతోంది.రాజకీయాల్లోకి రాకముందే నేను వ్యాపారవేత్తను. వ్యాపారం కోసం రాజకీయం చేసే గుణం నాది కాదు. ఈ నెల 20వ తేదీ సీఎం కేసీఆర్ హాజరయ్యే సభలో మూడున్నరేళ్లుగా మునుగోడుకు ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలి. మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారనే నమ్మకం ఉంది. మూడేన్నరేళ్ళలో పట్టించుకోని వీరంతా రేపటి నుంచి డబ్బు సంచులతో తిరుగుతారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్నికేసీఆర్ ఖూనీ చేశారు. మునుగోడు ప్రజలకు, కేసీఆర్కు మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఉప ఎన్నిక.’’ అని రాజ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-08-12T23:57:37+05:30 IST