ఒక్కరోజు వ్యవధిలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి
ABN, First Publish Date - 2022-05-23T07:31:37+05:30
మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రచ్చ బండ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రిష్టపురం ఎంపీటీసీ సభ్యురాలు షేక్ షాహేదా బేగం, భర్త జానీ పాషా, మామ బాజీ ఒక్క రోజు వ్యవధిలోనే సొంత గూటికి చేరారు.
చింతలపాలెం మే 22: మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రచ్చ బండ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రిష్టపురం ఎంపీటీసీ సభ్యురాలు షేక్ షాహేదా బేగం, భర్త జానీ పాషా, మామ బాజీ ఒక్క రోజు వ్యవధిలోనే సొంత గూటికి చేరారు. జడ్పీటీసి చింతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మదిర సత్యనారాయణరెడ్డి అధ్వ ర్యంలో టీఆర్ఎస్లో ఆదివారం ఉదయం చేరారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ వారిని భయభ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చకోవడం తగదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వేములూరి రంగాచారి, శ్రీనివాసరావు, జాని, మతిన్ పాల్గొన్నారు.
Updated Date - 2022-05-23T07:31:37+05:30 IST