‘వైబ్రా’ కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాటం
ABN, First Publish Date - 2022-09-19T05:48:06+05:30
వైబ్రా కంపెనీ కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు.
బీబీనగర్, సెప్టెంబరు 18: వైబ్రా కంపెనీ కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. బీబీనగర్లో మూతపడిన వైబ్రా అటోమెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎదుట బీఎంఎస్ ఆఽధ్వర్యంలో కార్మికులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. యాజమాన్యం కార్మికులకు సమాచారం ఇవ్వకుండా కంపెనీని మూసి వేయడమే కాకుండా, ఇక్కడి భూములను కూడా విక్రయించడానికి ప్రయత్నిం చడం దారుణమన్నారు. కార్మికులకు ఆరు నెలల వేతనంతో పాటు ఇతర సదుపాయలు రూ.6.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రెండు దశాబ్ధాలుగా కంపెనీని నమ్ముకొని జీవిస్తున్న వంద మందికి పైగా కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మి కులకు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరి నట్లు తెలిపారు. కార్మికులకు తెలియకుండా యాజమాన్యం కంపెనీ భూములను విక్రయించాలని చూస్తోందని, భూములు అమ్మకుండా నిషేదిత జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కా ర్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సురికంటి జంగారెడ్డి, బీఎం ఎస్ అధ్యక్షుడు చెన్నకేశవులు, రాజిరెడ్డి, జోగిరెడ్డి, బొబ్బల అంజిరెడ్డి, భిక్షపతిగౌడ్, బాలకృష్ణ, సదానందం, అనంతరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-09-19T05:48:06+05:30 IST