ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాము కాటుతో రైతు మృతి

ABN, First Publish Date - 2022-10-01T06:34:15+05:30

మండలంలోని శాంతినగర్‌ గ్రామంలో రైతు పాముకాటుతో మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు సింగారెడ్డి గోపాల్‌రెడ్డి(53)శుక్రవారం తన చేనులో గడ్డి కోస్తుండగా పాము కరించింది.

గోపాల్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతగిరి, సెప్టెంబరు 30: మండలంలోని శాంతినగర్‌ గ్రామంలో రైతు పాముకాటుతో మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు సింగారెడ్డి గోపాల్‌రెడ్డి(53)శుక్రవారం తన చేనులో గడ్డి కోస్తుండగా పాము కరించింది. సమీపంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మి కులు గుర్తించి ఆయనను కోదాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రైతు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పిడుగుపాటుకు రైతు ..

మేళ్లచెర్వు: పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన షేక్‌ ఆలెసైదా(38) శుక్రవారం తమ వ్యవసాయ భూమిలో పశువులను మేపుతుండగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. .మృతుని సోదరుడు షేక్‌ అజరత్‌ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2022-10-01T06:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising