జర్నలిస్టుల సమస్యలను సీఎంకు వివరిస్తా : ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2022-01-29T05:43:12+05:30
జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్కు వివరిస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో కార్యాలయంలో శుక్రవారం టీయూడబ్ల్యూజే-ఐజేయూ జర్నలిస్టు డైరీని యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
హుజూర్నగర్ , జనవరి 28 : జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్కు వివరిస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో కార్యాలయంలో శుక్రవారం టీయూడబ్ల్యూజే-ఐజేయూ జర్నలిస్టు డైరీని యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే హుజూర్నగర్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కోల నాగేశ్వరరావు, నరేందర్రెడ్డి, శేషంరాజు, రామిరెడ్డి, రామనాథం, భాస్కర్, రమేష్, రామకృష్ణ, మునిసిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, అమర్నాథ్రెడ్డి, గోపిరెడ్డి, దొంతగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-29T05:43:12+05:30 IST