ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండాల మండలంలో డ్రోన కలకలం

ABN, First Publish Date - 2022-10-05T05:29:21+05:30

వ్యవసాయ పొలంలో డ్రోన పడిన సంఘటన గుండాల మండలంలో కలకలం రేకెత్తించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

పెద్ద శబ్దంతో పొలంలో పడటంతో రైతుల్లో భయాందోళన

గుండాల, అక్టోబరు 4: వ్యవసాయ పొలంలో డ్రోన పడిన సంఘటన  గుండాల మండలంలో కలకలం రేకెత్తించింది. గుండాల మండలం రామారం గ్రామ పరిఽధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలాలా ఉన్నాయి. మండలంలోని రామారం గ్రామానికి చెందిన గుండ్లపల్లి రాంరెడ్డికి చెందిన పొలం వద్ద ఆకాశం నుంచి పెద్ద శబ్దం చేస్తూ ఓ డ్రోన చెట్ల మధ్య కూలింది. ఈ ఘటనతో సమీపంలోని రైతులు భయాందోళనకు గురయ్యారు. కొద్ది సమయానికి అక్కడికి చేరుకున్న డ్రోనకు సంబంధించిన నిర్వాహకులు దానిని తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో రైతులు డ్రోన 


విషయంపై వారిని ప్రశ్నించగా, గుండాల-మోత్కూరు ప్రధాన రహదారిలోని ఎంజీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో భారత సైన్యానికి సంబంధించిన డ్రోన పరీక్షలు నిర్వహిస్తున్నామని, పూర్తి సమాచారాన్ని ఇవ్వకూడదని తెలిపారు. ఈ విషయమై ఎస్‌ఐ యాకయ్యను వివరణ కోరగా డ్రోన కూలిన సంఘటన తన దృష్టికి రాలేదని తెలిపారు.


Updated Date - 2022-10-05T05:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising