వైద్యులు కనిపించే దేవుళ్లు
ABN, First Publish Date - 2022-07-02T06:44:03+05:30
కనిపించే దేవుళ్లు వైద్యు లు అని ఆవోపా నాయకులు అన్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడలోని రంగా థియేటర్ కార్యాలయంలో వైద్యులను సన్మానించారు.
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, జూలై 1: కనిపించే దేవుళ్లు వైద్యులు అని ఆవోపా నాయకులు అన్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడలోని రంగా థియేటర్ కార్యాలయంలో వైద్యులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఆవోపా నాయకులు మాట్లాడారు. కరోనా సమయంలో రోగులకు వైద్యులు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. కార్యక్రమంలో గోళ్ల చంద్ర య్య, ఇరుకుళ్ల చెన్నకేశవరావు, ఇమ్మడి రమేష్, చారుగడ్ల రాజశేఖర్, కృష్ణప్రసాద్, ఓరుగంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రావు, అనిల్కుమార్, వైద్యులు, నకిరేకంటి రవికుమార్, యాదా సుధీర్, నాగుబండి శ్రీనివాస రావు, లక్ష్మణ్, ప్రసాద్, సాయి నిహారిక తదితరులు పాల్గొన్నారు.
- నేరేడుచర్లలో వాసవి, వనిత క్లబ్ల ఆధ్వర్యంలో నేరేడుచర్ల, పెంచికల్దిన్న పీహెచ్సీల వైద్యాధికారులను సన్మానించారు. కార్యక్రమంలో వాసవి, వనితా క్లబ్ సభ్యులు రాచకొండ శ్రీనివాస్, గెల్లి మహాలక్ష్మి, మురారిశెట్టి రమేష్బాబు, పాల్వాయి గోపాలకృష్ణ, కందిబండ నర్మద, హేమలత, కందిబండ శ్రీనివాసరావు, నటరాజు, సుధాకర్, వెంకటేశ్వర్లు, సైదయ్య, కోటేశ్వరావు, లక్ష్మణ్, మోహన్ పాల్గొన్నారు.
- నూతన్కల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులు, ఆర్ఎంపీలను ఎంపీటీసీ పన్నాల రమమల్లారెడ్డి సన్మానించారు. వైద్యులు కటకం అనిల్కుమార్, షేక్ అసిఫా, గ్రామీణ వైద్యులు షేక్ నాగుల్ మీరా, పొదిల వెంకటయ్య, జటంగి కృష్ణ, సీహెచ్వో శ్రీనివాస్ను సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాబాది వెంకట్రెడ్డి, కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, నారాయణరెడ్డి, సత్యనారాయణ, మల్లయ్య, కృష్ణయ్య, తుంగతుర్తి విద్యాసాగర్రావు, సుధీర్రెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులు ఉన్నారు.
- తుంగతుర్తి మండలకేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లను ఎంపీటీసీ చెరుకు సృజనపరమేష్ సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, వెంకటేశ్వర్లు, యాదగిరి, మహేష్, మహేష్, ఎల్లయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
- హుజూర్నగర్ మండలం లింగగిరి పీహెచ్సీలో డాక్టర్లు కిరణ్కుమార్, ప్రజూన్కుమార్ను సన్మానించారు. కార్యక్రమంలో గజకంటి ప్రభాకర్, ఇందిరాల రామకృష్ణ, ఉదయ్గిరి, శ్రీనివాస్, పాల్గొన్నారు.
- జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ మండ లం రామలక్ష్మీపురం ప్రాధమిక పాఠశాలలో సీజనల్ వ్యాధులతో విద్యారు ్థలకు హెచ్ఎం హనుమంతరావు, ఉపాధ్యాయుడు బడుగుల సైదులు అవగాహన కల్పించారు.
Updated Date - 2022-07-02T06:44:03+05:30 IST