ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్‌లో జిల్లా యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-11-19T01:08:30+05:30

మానసిక సమస్యలతో మన స్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా కేంద్రం ధర్మారంలో జరిగింది.

జయపాల్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌, నవంబరు 18: మానసిక సమస్యలతో మన స్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా కేంద్రం ధర్మారంలో జరిగింది. వరంగల్‌ జీఆర్‌పీ సీఐ జి.నరేష్‌ కథనం ప్రకారం.. చింతలపాలెం మండలం మల్లచెరువు గ్రామానికి చెందిన ముడుసు జయపాల్‌ రెడ్డి(27)నాలుగు రోజుల క్రితం వరంగల్‌ జిల్లా ఊకల్‌ రాం నగర్‌ లోని బంధువుల ఇంటికి వచ్చాడు. మానసిక సమస్యతో మందులు వాడుతున్నాడు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి, రాత్రి వరకు తిరిగిరాలేదు. ఫోన్‌ చేసి స్వీచ్ఛాప్‌ వచ్చింది. బంధువులను వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ధర్మారం గేటు వద్ద మూడో రైల్వే లైన్‌లోలో పోలీసులు అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగు మందు డబ్బా ఉంది. దీంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహానికి ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యు లకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పరశురాములు తెలిపారు.

రు.

Updated Date - 2022-11-19T01:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising