‘దళిత బంధు’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2022-08-06T06:26:48+05:30
‘దళిత బంధు’ యూనిట్లను లబ్ధి దారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష అన్నారు.
సూర్యాపేట రూరల్, ఆగస్టు 5: ‘దళిత బంధు’ యూనిట్లను లబ్ధి దారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సూర్యాపేట- తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన డెయిరీ, షీష్ యూనిట్ ‘దళిత బంధు’ లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు గొర్రెలు, గేదెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. ఈ యూనిట్లన సద్వినియోగం చేసుకుని ఆరి ్థకంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్రావు. ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-06T06:26:48+05:30 IST