ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సులో భక్తుల మధ్య తోపులాట

ABN, First Publish Date - 2022-05-28T06:02:58+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన రెండు కుటుంబాల మధ్య ఆర్టీసీ బస్సులో జరిగిన తోపులాట ఘర్షణకు దారితీసింది.

కొండపై ఘర్షణకు దిగిన ఇరుకుటుంబాల సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

 యాదగిరిగుట్ట కొండపై ఘటన 

యాదగిరిగుట్ట, మే 27: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన రెండు కుటుంబాల మధ్య ఆర్టీసీ బస్సులో జరిగిన తోపులాట ఘర్షణకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు సికింద్రాబాద్‌కు చెందిన ఓ కుటుంబం, హైదరాబాద్‌కు చెందిన మరో కుటుంబం యాదగిరిగుట్టకు వచ్చాయి. శుక్రవారం కొండకింద కల్యాణకట్ట నుంచి కొండపైకి భక్తులతో వెళుతున్న బస్సు సర్వీసులో రద్దీ అధికంగా ఉండడంతో ఫుట్‌బోర్డుపైన కూడా భక్తులు నిలబడి ఉన్నారు. అయితే కొండపైకి వెళుతున్న క్రమంలో బస్సు ఒక్కసారిగా తోపులాటకు గురైంది. దీంతో హైదరాబాద్‌కు చెందిన కుటుంబ సభ్యుల్లోని ఓ యువకుడు పక్కనే ఉన్న సికింద్రాబాద్‌ కుటుంబానికి చెందిన యువతిని తగిలాడు. సదరు యువతి యువకుడితో ఘర్షణకు దిగింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణకు దారితీసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తోటి ప్రయాణికులు ఇరు కుటుంబాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా గొడవ తీవ్రరూపం దాల్చుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

Updated Date - 2022-05-28T06:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising