చెర్వుగట్టులో అవినీతిని అరికట్టాలి
ABN, First Publish Date - 2022-04-18T06:22:25+05:30
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు రామలింగేశ్వర ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్కురుమ డిమాండ్ చేశారు.
బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్
నార్కట్పల్లి, ఏప్రిల్ 17: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు రామలింగేశ్వర ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్కురుమ డిమాండ్ చేశారు. ఆలయంలోని ఈవో కార్యాలయం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తలనీలాల టెండర్ గడువు కాలం ముగిసినా దానిని నిబంధనలకు విరుద్ధంగా పొడిగించారని, టెండర్ను ఆంధ్రా వాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. ఆలయంలో కొంతమంది అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారనీ, ఆలయ భూమి కౌలు విషయంలో నిబంధనలు పాటించలేదనీ ఆరోపించారు. అలాగే లడ్డూ ప్రసాదంలో నాణ్యత పాటించడం లేదన్నారు. ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఈ నెల 25 నుండి ఆమరణదీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గండిచెర్వు వెంకన్నగౌడ్, ఉపాధ్యాక్షుడు బూడిద మల్లిఖార్జున, పానుగంటి విజయ్గౌడ్, నాయకులు గూడూరు భాస్కర్, నర్సింహ్మ, ఊయ్యాల రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2022-04-18T06:22:25+05:30 IST