పాఠశాల అభివృద్ధికి సహకరించాలి
ABN, First Publish Date - 2022-05-28T05:51:41+05:30
ప్రభుత్వ పాఠశాలల అబివృద్ధికి సహకరించాలని సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ అన్నారు. మండలకేంద్రంలోని బోట్యా
ఆత్మకూర్(ఎస్), మే 27: ప్రభుత్వ పాఠశాలల అబివృద్ధికి సహకరించాలని సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ అన్నారు. మండలకేంద్రంలోని బోట్యాతండా ప్రాథ మిక పాఠశాలకు రూ.40వేలు విలువ చేసే రక్షిత నీటి ప్లాంట్, ఫ్యాన్లు, టేబుల్స్, బోర్డులు శుక్రవారం అందజేసి, మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అమంచి అచ్యుతశర్మ, కాశయ్య, గుండా రమేష్, లింగానాయక్, లక్ష్మణ్, మల్సూర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-05-28T05:51:41+05:30 IST