ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్యూనిస్టులే సాయుధ పోరాటవారసులు

ABN, First Publish Date - 2022-09-12T05:18:41+05:30

నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని చేపట్టారని, కమ్యూనిస్టులే సాయుధ పోరాటవారసులని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు.

గుండ్రాంపల్లిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

చిట్యాలరూరల్‌, సెప్టెంబరు 11: నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని చేపట్టారని, కమ్యూనిస్టులే సాయుధ పోరాటవారసులని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఆదివారం సాయుధ పోరాట వారోత్సవాలను ప్రారంభించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేశారని, అందులో వందలాది మంది అమరులయ్యారన్నారు. గుండ్రాంపల్లి చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్‌కుమార్‌, బొల్గూరి నర్సింహ, గురిజ రామచంద్రం, టి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-12T05:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising