ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి

ABN, First Publish Date - 2022-08-18T05:17:41+05:30

విరివిగా మొక్కలునాటి వాతావరణ సమతుల్యంలో భాగస్వాములుకావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు

వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ సత్పథి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌

భువనగిరి రూరల్‌, ఆగస్టు 17: విరివిగా మొక్కలునాటి వాతావరణ సమతుల్యంలో భాగస్వాములుకావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం ఆయన హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ సంపదను 33శాతం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఇందుకుగా ను రాష్ట్రవ్యాప్తంగా 230కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధేశించుకున్నామన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్‌ పమేలాసత్పథి మాట్లాడుతూ ఈ నెల 21న జిల్లాలో 2లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఈఎస్‌ నవీన్‌కుమార్‌, డీపీవో ఆర్‌.సునంద, అదనపు పీడీ టి.నాగిరెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మీ పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-18T05:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising