TS News.. అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్రను అడ్డుకున్నాం: రచనా రెడ్డి
ABN, First Publish Date - 2022-10-14T21:19:48+05:30
మునుగోడు కొత్త ఓటర్ల నమోదుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతించారు.
హైదరాబాద్ (Hyderabad): మునుగోడు (Munugodu) కొత్త ఓటర్ల నమోదు (New Voters Registration) పై హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును రాష్ట్ర బీజేపీ నేతలు (BJP Leaders) స్వాగతించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి రచనా రెడ్డి (Rachana Reddy) మాట్లాడుతూ.. అధికార పార్టీ తీరుపై విమర్శలు చేశారు. అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ కుట్రను అడ్డుకున్నామన్నారు. ఉప ఎన్నికలో 25వేల ఓట్లను ఒకేసారి డంపు చేయాలని టీఆఅర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని ఓటర్లుగా నమోదు చేయించారని, అధికార యంత్రాంగంపై ఒత్తిడి చేస్తోందన్నారు. బీజేపీ అడ్డుకోకుంటే.. 25 వేల బోగస్ ఓట్లు నమోదు అయ్యేవని రచనా రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-10-14T21:19:48+05:30 IST