పాఠశాలల్లో మెరుగైన బోధన అందించాలి
ABN, First Publish Date - 2022-12-10T00:59:58+05:30
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాభోదన చేయాలని, అందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని జాన్పహాడ్, పాలకవీడు, కల్మెట్తండా, కొత్తతండా, మహంకాళిగూడెం, బొత్తలపాలెం పాఠశాలల్లో ‘మన ఊరు, మన బడి’ కింద ప్రారంభించిన తరగతి గదుల పనులను, పిల్లల సామర్ధ్యాలను పరిశీలించరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
డీఈవో అశోక్
పాలకవీడు, డిసెంబరు 9: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాభోదన చేయాలని, అందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని జాన్పహాడ్, పాలకవీడు, కల్మెట్తండా, కొత్తతండా, మహంకాళిగూడెం, బొత్తలపాలెం పాఠశాలల్లో ‘మన ఊరు, మన బడి’ కింద ప్రారంభించిన తరగతి గదుల పనులను, పిల్లల సామర్ధ్యాలను పరిశీలించరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నిర్మాణంలో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాంరెడ్డి, బాలునాయక్, శ్రీనయ్య, అనంతరెడ్డి, ఉన్నారు.
Updated Date - 2022-12-10T00:59:59+05:30 IST