బండ్రు నర్సింహులు మృతి తీరనిలోటు
ABN, First Publish Date - 2022-01-25T05:58:04+05:30
జనశక్తి రాష్ట్ర నాయకుడు బండ్రు నర్సింహులు మృతి విప్లవోద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం డివిజన్ కార్యదర్శి ఆరుట్ల శంకర్రెడ్డి అన్నారు.
సూర్యాపేట కల్చరల్, జనవరి 24: జనశక్తి రాష్ట్ర నాయకుడు బండ్రు నర్సింహులు మృతి విప్లవోద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం డివిజన్ కార్యదర్శి ఆరుట్ల శంకర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని విక్రమ్భవన్లో నర్సింహులు చిత్రపటానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సింహులు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కొత్తపెల్లి రేణుక, దొంతమల్ల రామన్న, జీవన్, వెంకటమ్మ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-25T05:58:04+05:30 IST