ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది క్రితం తల్లి .. నేడు తండ్రి మృతి

ABN, First Publish Date - 2022-09-10T06:33:47+05:30

ఏడాది క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి చెంద డంతో ఆ దంపతుల ఇద్దరు చిన్నారులు ఒంటరి అయ్యారు.

కరుణాకర్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న చిన్నారులు, గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఒంటరైన చిన్నారులు 

నాగులపాటిఅన్నారం గ్రామంలో  ఘటన

పెన్‌పహాడ్‌, సెప్టెంబరు 9: ఏడాది క్రితం తల్లి.. ఇప్పుడు తండ్రి మృతి చెంద డంతో ఆ దంపతుల ఇద్దరు చిన్నారులు ఒంటరి అయ్యారు. ఈ ఘటన  మండ లంలోని నాగులపాటి అన్నారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అనంతుల కరుణాకర్‌ (30) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భార్య దీపిక ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ దంపతులకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న సుష్మిత, ఆరేళ్ల వయసు ఉన్న  లిఖిత ఉన్నారు. ఈ కుటుంబానికి భూమి లేదు. చిన్న గుడిసె ఉంది. తల్లి మృతి చెందినప్పటి నుంచి కుమార్తెలను తండ్రే సంరక్షిస్తున్నాడు. తండ్రి కరుణాకర్‌ కూడా మృతి చెందటంతో ఆయన మృతదేహంపై పడి చిన్నారులు విలపించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది. బంధుమిత్రులు చందాలు వేసుకుని కరుణాకర్‌ దహన సంస్కారాలను పూర్తి చేశారు. ఒంటరైన చిన్నారుల సంరక్షణ బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. చిన్నారుల సంరక్షణ చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.




Updated Date - 2022-09-10T06:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising