పుష్కరఘాట్లో పడి వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-08-10T06:27:25+05:30
మద్యం మత్తులో పుష్కరఘాట్ లో పడి ఓ యువకుడు మృతి చెందాడు.
కనగల్, ఆగస్టు 9: మద్యం మత్తులో పుష్కరఘాట్ లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కనగల్ మండలం దర్వేశిస్టేజీ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొం డ మండలం పారేపల్లిగూడెం గ్రామానికి చెందిన సంపం గి లింగయ్య (25) తన సోదరుడైన వీరస్వామి ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన మొక్కుబడి వే డుకకు హాజరయ్యాడు. మద్యం మత్తులో ఉన్న లింగయ్య మధ్యాహ్నం సమీపంలోని ముఖం కడిగేందుకు పుష్కరఘాట్కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యు లు, బంధువులు లింగయ్యను బయటికి తీసుకురాగా అప్పటికే ప్రాణాలు కోల్పోయా డు. మృతుడు లింగయ్యకు భార్యతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య తి రుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2022-08-10T06:27:25+05:30 IST