మతి స్థిమితం లేని మహిళ వెంట బాలిక..
ABN, First Publish Date - 2022-07-03T06:06:00+05:30
మతిస్థిమితం లేని మహిళ ఆరేళ్ల గుర్తు తెలియని చిన్నారిని వెంట తీసుకొచ్చింది. ఈ సంఘటన వీరవెల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది.
భువనగిరి టౌన, జూలై 2: మతిస్థిమితం లేని మహిళ ఆరేళ్ల గుర్తు తెలియని చిన్నారిని వెంట తీసుకొచ్చింది. ఈ సంఘటన వీరవెల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. భువనగిరి రూరల్ ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని మహిళ లక్ష్మి వలిగొండ మండలంలోని వేములకొండ పుణ్యక్షేత్రానికి వెళ్తానని ఇంటి నుంచి శుక్రవారం బయలుదేరింది. శనివారం తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఆమె వెంట ఆరు సంవత్సరాల చిన్నారిని తీసుకువచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆ పాప ఎవరని ప్రశ్నించినప్పటికీ లక్ష్మి సరైన సమాధానం చెప్పలేదు. అలాగే ఆ చిన్నారి కూడా తమ కుటుంబ వివరాలు చెప్పలేక పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ పాపను చైల్డ్ హోంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిసిన వారు రూరల్ ఎస్ఐ సెల్ నెంబర్ 9490617543కి సమాచారం ఇవ్వాలని కోరారు.
Updated Date - 2022-07-03T06:06:00+05:30 IST