ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagarjuna Sagar: 574.90 అడుగులకు చేరుకున్న ‘సాగర్‌’ నీటి మట్టం

ABN, First Publish Date - 2022-08-09T02:29:02+05:30

నల్లగొండ జిల్లా (Nalgonda District) లోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam)కు ఎగువ నుంచి వరద రాక స్వల్పంగా తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌: నల్లగొండ జిల్లా (Nalgonda District) లోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam)కు ఎగువ నుంచి వరద రాక స్వల్పంగా తగ్గింది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 574.90 అడుగులకు (268.8689 టీఎంసీలు) చేరింది. మరో 44 టీఎంసీల నీరు వచ్చి చేరితే సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుంటుంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 2,236 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 2,608 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 30,640 క్యూసెక్కులు మొత్తంగా 35,484 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


రెండు గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల 

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు (Pulichinthala Project)కు ఎగువ నుంచి 52,727 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో రెండు గేట్లను మీటరు ఎత్తి 21,100క్యూసెక్కులు, ప్రాజెక్టు పవర్‌ హౌస్‌లోని మూడు యూనిట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 70 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు (45.77టీఎంసీలు)అడుగులు, కాగా ప్రస్తుతం 171.58 అడుగులుగా (40.63టీఎంసీలు) ఉంది.

Updated Date - 2022-08-09T02:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising