Munugodu bypoll: మునుగోడులో వినూత్న ప్రచారానికి టీపీసీసీ ప్లాన్
ABN, First Publish Date - 2022-08-20T13:38:18+05:30
మునుగోడు ఉపఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నారు.
మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నారు. అధికార పార్టీ (TRS), బీజేపీ (BJP) పార్టీలు మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ (Congress) మునుగోడులో పాదయాత్రలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా వినూత్నరీతిలో ప్రచారానికి టీపీసీసీ (TPCC) ప్రణాళికను సిద్ధం చేసింది. ఇంటింటికీ వెళ్లి లక్ష మంది కాళ్లు మొక్కి ఓటు అడిగే లా వ్యూహాన్ని రంచించింది. అందుకోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) వీరాభి మానులు రంగంలోకి దిగనున్నారు. వెయ్యి మంది అభిమానులతో స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశారు. ఓ వైపు పార్టీ నేతల ప్రచారం, మరో వైపు రేవంత్ (TPCC chief) టీమ్ ఓటర్ల కాళ్లు మొక్కి ఓటు అడిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ధన ప్రవాహాన్నీ సెంటిమెంట్తో తిప్పి కొట్టాలని పీసీసీ (PCC) స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
Updated Date - 2022-08-20T13:38:18+05:30 IST