ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode: మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసమే వచ్చింది: రాజగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-09-28T22:47:18+05:30

మునుగోడు (Munugode) ఉప ఎన్నిక ప్రజల కోసమే వచ్చిందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: మునుగోడు (Munugode) ఉప ఎన్నిక ప్రజల కోసమే వచ్చిందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారితే అమ్ముడుపోయానని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా దెబ్బకు సీఎం కేసీఆర్ (CM KCR) మునుగోడు వచ్చారని తెలిపారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ ఎక్కడికి పోయింది? అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ఓట్ల సాధనే లక్ష్యంగా ప్రధాన పార్టీలు మునుగోడులో పావులు కదుపుతున్నాయి.సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకున్న పార్టీలు ఓటర్లను గుర్తించే పనిలో ఉండగా, బీజేపీ (BJP) శరవేగంగా సంస్థాగత కమిటీల ఏర్పాటు చేసుకుంటోంది. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ (TRS)లు చాపకింద నీరు లా ఓటర్లను చేరుకునేందుకు సైలంట్‌ ఆపరేషన్‌ చేపడుతున్నాయి. దసరాలోపు ఆపరేషన్‌ ఆకర్ష్‌ను, కమిటీలు ఏర్పాటు చేసుకుని పండుగ తర్వాత నేరుగా ఓటర్లను కలిసే కార్యక్రమాలు ప్రధానంగా బరిలో ఉన్న మూడు పార్టీలు వ్యూహాల ను ఖరారుచేశాయి. మునుగోడు ఓటర్లను దగ్గర చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌ వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మండలాలవారీగా భారీ సమావేశాలు ఏర్పాటుచేస్తోంది. 

Updated Date - 2022-09-28T22:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising