TS news: మావోయిస్టుల లేఖ కలకలం
ABN, First Publish Date - 2022-08-13T19:03:14+05:30
జిల్లాలో మావోయిస్టుల (Maoist) లేఖ కలకలం రేపుతోంది.
ములుగు: జిల్లాలో మావోయిస్టుల (Maoist) లేఖ కలకలం రేపుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏటూరు నాగారం — మహదేవపూర్ ఏరియా కమిటి కార్యదర్శి సబిత పేరుతో లేఖ విడుదల అయ్యింది. సాగు భూముల జోలికి వస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. పెద్దపళ్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు అతని అనుచరులు మరి కొంతమంది కబ్జాదారులు.. ఆదివాసులు సాగు చేసుకునే భూముల జోలికి వస్తున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. ఆదివాసుల భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి అధికారులకు మామూలు ముట్టజెప్పి, పట్టాలు చేసుకుని రైతుబంధు పొందుతున్నారని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు.
Updated Date - 2022-08-13T19:03:14+05:30 IST