Mulugu జిల్లా: ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి
ABN, First Publish Date - 2022-06-25T19:24:20+05:30
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 40 మంది కూలీలు గాయపడ్డారు.
ములుగు జిల్లా (Mulugu district): మంగపేట (Mangapeta)లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 40 మంది కూలీలు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని వెంటనే స్థానిక మంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
Updated Date - 2022-06-25T19:24:20+05:30 IST