BJP, ప్రధాని డైరెక్షన్లోనే మహిళా దర్బార్: జగ్గారెడ్డి
ABN, First Publish Date - 2022-06-10T23:16:04+05:30
BJP Prime Minister Jaggareddy
హైదరాబాద్: బీజేపీ, ప్రధాని డైరెక్షన్లోనే రాజ్భవన్లో మహిళా దర్బార్ నిర్వహించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మతవిద్వేషాలతో ఓట్లు రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ప్రభుత్వం, పోలీసులు రాజాసింగ్ లాంటి వ్యక్తులను ఎందుకు కట్టడి చేయట్లేదు? అని ప్రశ్నించారు. రాజాసింగ్, హిందువులు ఆజ్మీర్ దర్గాకు వెళ్లకుండా అడ్డుకోగలరా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
Updated Date - 2022-06-10T23:16:04+05:30 IST