నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్ను.. ఆ విషయం బాగా తెలిసిన వాడిని: రఘురామ
ABN, First Publish Date - 2022-01-12T17:30:46+05:30
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చి వెళ్లిన అనంతరం బుధవారం రఘురామ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చి వెళ్లిన అనంతరం బుధవారం రఘురామ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పవన్ కల్యాణ్ అభిమాని అని చెప్పారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే.
Updated Date - 2022-01-12T17:30:46+05:30 IST