ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన తల్లి
ABN, First Publish Date - 2022-12-30T08:34:09+05:30
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. సంగారెడ్డి నుంచి బాలానగర్ నర్సాపూర్ క్రాస్ రోడ్కి బస్సులో వచ్చిన మాధవి అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కనిపించకుండా పోయింది.
Hyderabad : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. సంగారెడ్డి నుంచి బాలానగర్ నర్సాపూర్ క్రాస్ రోడ్కి బస్సులో వచ్చిన మాధవి అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కనిపించకుండా పోయింది. ఇంటికి రావాల్సిన తల్లీపిల్లలు అదృశ్యమయ్యారు. ఈ నెల 23వ తేదీన యాదగిరి గుట్టకు వెళ్లి అక్కడ నుంచి పిల్లలతో కలిసి తన పుట్టింటికి వెళ్లింది. సంగారెడ్డి నుంచి హైదరాబాద్లోని తన ఇంటికి బస్సులో తన తల్లి, పిల్లలతో మాధవి బయలుదేరి వచ్చింది. నర్సాపూర్ క్రాస్లో పిల్లలు, మాధవి బస్సు దిగినట్లు అల్లుడు రమేష్కి అత్త సమాచారం ఇచ్చింది. నిన్నటి నుంచి కనిపించడం లేదని బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-12-30T08:34:11+05:30 IST