ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode bypoll: బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా మోదీ హైదరాబాద్‌ టూర్‌

ABN, First Publish Date - 2022-10-04T00:54:16+05:30

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Narendramodi) ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Narendramodi) ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలో జరగనున్న యుఎన్‌డబ్ల్యూజీఐసీ (UNWGIC) సదస్సులో ప్రధాని మోదీ  ప్రసంగించనున్న‌ారు. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా యుఎన్‌డబ్ల్యూజీఐసీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకానుంది. అలాగే 120 దేశాలకు చెందిన సుమారు 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా మోదీ హైదరాబాద్‌ టూర్‌ ఉందని చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక (Munugode bypoll) షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Central election commission) విడుదల చేసింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ (by poll polling).. అనంతరం నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14 వరకూ నామినేషన్ల దాఖలకు గడువు ఉంది. 


మునుగోడుపై బీజేపీ ఫోకస్

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నాయి. మూడు పార్టీలకు ఈ విజయం తప్పనిసరి కావడంతో బాగా ఫోకస్ పెట్టాయి. బీజేపీ (BJP) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బీజేపీ యాక్షన్ ప్లాన్‌ (Action Plan)ను సిద్ధం చేసింది. దసరా తరువాతి రోజు నుంచి మునుగోడుపై దండయాత్రకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. 7వ తేదీ నుంచి మునుగోడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ (Bandi Sanjay) ఫోకస్ చేయనున్నారు.‌ ప్రతి నేత.. ప్రతి ఇంటిని టచ్ చేసేలా ప్రచారానికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈనెల 7న మునుగోడులో అన్ని గ్రామాల్లో బీజేపీ బైక్ యాత్రలు నిర్వహించనుంది. 10వ తేదీన బూత్ కమిటీ సభ్యలతో బండి సంజయ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది. 189 గ్రామాల్లో జరగనున్న బైక్ యాత్రల్లో స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

Updated Date - 2022-10-04T00:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising