రేపు కాలినడకన తిరుమలకు ఎమ్మెల్సీ Kavitha
ABN, First Publish Date - 2022-02-16T16:27:06+05:30
ఎమ్మెల్సీ కవిత రేపు(గురువారం) కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత రేపు(గురువారం) కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని మధ్యాహ్నం కాలినడకన ఎమ్మెల్సీ తిరుమలకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించి, సాయంత్రానికి కొండ మీదకు చేరుకోనున్న కవిత...ఆపై కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
Updated Date - 2022-02-16T16:27:06+05:30 IST