కుందనపల్లి ప్రజలతో ఎమ్మెల్యే మహాపాద యాత్ర
ABN, First Publish Date - 2022-02-21T23:51:52+05:30
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామస్తులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం మహాపాదయాత్ర న్విహించారు.
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామస్తులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం మహాపాదయాత్ర న్విహించారు. ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన బూడిద చెరువు వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించాలని పదిహేను రోజులుగా కుందనపల్లి గ్రామస్తులు నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినా ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి కలెక్టరేట్ వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. సోమవారం ఉదయం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గ్రామస్థులతో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్ వరకు సుమారు 24 కిలోమీటర్ల వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. కొద్దిసేపు కలెక్టరేట్ గేటు ఎదుట నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ చాంబర్ వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు గ్రామస్థులు కుందనపల్లి గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు.
Updated Date - 2022-02-21T23:51:52+05:30 IST