ఖిలాషాపూర్ కోటకు పూర్వ వైభవం తీసుకువస్తాం: మంత్రి Srinivas
ABN, First Publish Date - 2022-06-22T19:36:47+05:30
ఖిలాషాపూర్ కోటకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
జనగామ: ఖిలాషాపూర్ కోటకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud) తెలిపారు. బుధవారం జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ కోటను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖిలాషాపూర్ కోటతో పాటు తాటికొండ కోట కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కోట గోడ కూలడంతో ఇళ్ళు కోల్పోయిన బాధితులకు పది రోజులలో స్థలం కేటాయిస్తామని చెప్పారు. పాపన్న జయంతి ఉత్సవాలు కోటలో జరుపుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతినెలలో ఒకరోజు ఉపాధి హమీ పథకంతో కోట పారిశుద్ధ్య పనులు చేపడతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
Updated Date - 2022-06-22T19:36:47+05:30 IST