యాదాద్రిలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
ABN, First Publish Date - 2022-01-02T18:48:19+05:30
అతి తక్కువ సమయంలో యాదాద్రిని పునర్నిర్మించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
యాదాద్రి-భువనగిరి: అతి తక్కువ సమయంలో యాదాద్రిని పునర్నిర్మించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మంత్రి యాదాద్రిలో పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ..కలలో కూడా ఊహించని విధంగా యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకురావడానికి సీఎం కేసీఆర్కు శక్తినివ్వాలని ఆ దేవుడిని కోరుకున్నానని చెప్పారు. మరో రెండు నెలల్లో యాదాద్రి పునఃప్రారంభం కాబోతుందన్నారు. సీఎం కేసీఆర్ ధృడసంకల్పానికి యాదాద్రి నిర్మాణమే నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-01-02T18:48:19+05:30 IST