Telangana: ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి సత్యవతి
ABN, First Publish Date - 2022-03-16T15:34:52+05:30
జిల్లాలోని కురవి మండలం సీరోల్ గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను బుధవారం ఉదయం మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు.
మహబూబాబాద్: జిల్లాలోని కురవి మండలం సీరోల్ గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను బుధవారం ఉదయం మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. గురుకులం పరిసరాలను పరిశీలించడంతో పాటు.. సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని, గురుకులం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సత్యవతిరాథోడ్ గురుకులంలో టిఫిన్ చేశారు. నిన్న పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
Updated Date - 2022-03-16T15:34:52+05:30 IST