పట్టణ అభివృద్ధికి వారు సహకరీంచడం లేదు: Satyavathi Rathod
ABN, First Publish Date - 2022-06-03T18:15:07+05:30
మహబూబాబాద్లోని ప్రతి వార్డులో ప్రభుత్వ భూముల్లో పేదలు ఇండ్లను నిర్మించుకున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు.
Mahabubabad: పట్టణంలోని ప్రతి వార్డులో ప్రభుత్వ భూముల్లో పేదలు ఇండ్లను నిర్మించుకున్నారని, పట్టణ అభివృద్ధికి వారు సహకరించడం లేదని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు జిల్లాపై ప్రత్యేక శ్రద్ద ఉందని అన్నారు. మహబూబాబాద్ పట్టణంలో నిర్మితమవుతున్న ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని, అందరి సమన్వయంతో పని చేసి మహబూబాబాద్ను అభివృద్ధి చేద్దామని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బందులు పెడుతోందన్నారు. సర్పంచ్లు అందరూ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. సీఎం కేసీఆర్పై కొందరు చౌకబారు ఆరోపణలు చేస్తూ గజినీలా ప్రవర్తిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-06-03T18:15:07+05:30 IST