ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికే ఆదర్శంగా ఫీవర్ సర్వే: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ABN, First Publish Date - 2022-02-22T21:18:55+05:30

రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వే దేశానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లాలోని ఆశ కార్యకర్తలకు స్మార్ట్’ఫోన్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య శాఖకు తోడుగా ఆశా కార్యకర్తలు నిలబడి సహకారం అందించటం గొప్ప విషయమన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి ఆశా వర్కర్లు చేసిన సేవ ఎంతో గొప్పదని ఆమె కొనియాడారు. కోవిడ్ సమయంలో చేసిన కష్టాన్ని గుర్తించి ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను సీఎం అందిస్తున్నారన్నారు. ఆశ కార్యకర్తల జీతాలను 3 వేల నుంచి 9 వేలకు కేసీఆర్ పెంచారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-22T21:18:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising