బీజేపీవి చిల్లర రాజకీయాలు:Niranjan reddy
ABN, First Publish Date - 2022-06-01T21:43:27+05:30
తెలంగాణలో బీజేపీవి(bjp) చిల్లర రాజకీయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి(niranjan reddy) విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీవి(bjp) చిల్లర రాజకీయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి(niranjan reddy) విమర్శించారు.అలాగే డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ కొత్త డ్రామాలు చేస్తోందని అన్నారు.బీజేపీ, కాంగ్రెస్లు రైతులకు చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రైతులకు నిజమైన న్యాయం జరిగిందని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే తెలంగాణలో బీడు భూములన్నీ పచ్చగా మారాయన్నారు. గతేడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని మంత్రి తెలిపారు.తెలంగాణ పత్తి అంటే హాట్కేక్లా అమ్ముడుపోతుందని చెప్పారు.
Updated Date - 2022-06-01T21:43:27+05:30 IST