తెలంగాణపై కేంద్రానిది చిన్న చూపు: మంత్రి Mallareddy
ABN, First Publish Date - 2022-06-24T19:11:33+05:30
75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ కార్మికలోకానికి ఒక్క మంచి పని కూడా చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి సింగరేణి స్థలాల్లో ఉంటున్న
మంచిర్యాల: 75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ కార్మికలోకానికి ఒక్క మంచి పని కూడా చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి సింగరేణి స్థలాల్లో ఉంటున్న పేదలకు పట్టాలు ఇప్పించిన ఘనత బాల్క సుమన్కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి(Mallareddy)అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తూ నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. అయినా కూడా కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని తెలిపారు. గుజరాత్ మహిళలు తాగునీటి కోసం ప్రధాని నరేంద్ర మోదీకి లెటర్ రాస్తే ఇప్పటి వరకు సమస్య తీర్చలేదన్నారు. కానీ ఇక్కడ సీఎం కేసీఆర్ ఒక ఇంజనీర్లా నిలబడి మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడు దొంగల్లా మారి కేసీఆర్పై అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నారని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.
Updated Date - 2022-06-24T19:11:33+05:30 IST