ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్ బట్టేబాజ్... డబ్బులిచ్చి టీపీసీసీ పదవి కొన్నాడు: మంత్రి Mallareddy

ABN, First Publish Date - 2022-05-24T18:33:38+05:30

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్‌ అని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth reddy)కి మంత్రి మల్లారెడ్డి (Malla reddy) కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్‌ అని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నారని ఆరోపించారు. రేవంత్‌ చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌(Rahul gandhi)ను కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తారన్నారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గుడని.. బట్టేబాజ్‌ అంటూ మంత్రి  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


రేవంత్‌ది రచ్చబండ కాదని.. లుచ్చాబండ అంటూ దుయ్యబట్టారు. రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్‌ అవుతుందన్నారు. ‘‘నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌తో అనేక ఇబ్బందులు పడ్డా. టీడీపీలో ఉన్నప్పుడు నన్ను కూడా రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. నా కాలేజీలు మూసివేయిస్తానని బెదిరించాడు. మల్కాజ్‌గిరి సీటు రాకుండా అడ్డుకునేందుకు యత్నించాడు. చంద్రబాబు (Chandrababu)కు వాస్తవాలన్నీ చెప్పి సీటు తెచ్చుకుని..గెలిచా. రేవంత్‌ ఇప్పటికీ నన్ను విడిచిపెట్టకుండా అదే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు. ఇలా రేవంత్ నన్ను అడుగడుగునా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు’’ అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-05-24T18:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising