Minister KTR: తెలంగాణలో వర్షాలు, సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
ABN, First Publish Date - 2022-07-27T19:49:38+05:30
రాష్ట్రంలో వర్షాలు, సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ (KTR) బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మున్సిపాల్టీ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కల్వర్టులు, వంతెనల దగ్గర హెచ్చరిక సూచీలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువులు, కుంటల దగ్గర నిరంతర పర్యవేక్షణ జరపాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
Updated Date - 2022-07-27T19:49:38+05:30 IST