నేడు హైదరాబాద్లో మంత్రి KTR పర్యటన
ABN, First Publish Date - 2022-02-12T13:45:47+05:30
మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. సనత్నగర్ నియోజకవర్గలో మంత్రి తలసానితో కలిసి రూ.61 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలో పర్యటించనున్నారు. సనత్నగర్ నియోజకవర్గలో మంత్రి తలసానితో కలిసి రూ.61 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వరద ముంపు సమస్యకు చెక్ పెట్టెందుకు ఎస్ఎన్డీపీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆపై రసూల్పురా క్రాస్ రోడ్లోని హాకీ స్టేడియం వద్ద గల నాలా అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభిస్తారు. రసూల్పురాలోని కరాచీ బేకరీ వద్ద నాలా అభివృద్ధి పనులు జరుగనున్నాయి. పాటిగడ్డలో మల్టీఫర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు, అల్లంతోట బావి లో నాలా అభివృద్ధి పనులు, బ్రాహ్మణ వాడిలో నాలా అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Updated Date - 2022-02-12T13:45:47+05:30 IST