ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి మరింత పదును: మంత్రి కొప్పుల

ABN, First Publish Date - 2022-01-07T00:10:42+05:30

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక,పౌర హక్కుల పరిరక్షణ చట్టాలను మరింత పకడ్బంధీగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక,పౌర హక్కుల పరిరక్షణ  చట్టాలను మరింత పకడ్బంధీగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు,చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ ,ఎస్టీ అత్యాచార నిరోధక,పౌర హక్కుల పరిరక్షణ చట్టాల అమలునకు సంబంధించిన ఉన్నత స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం సంక్షేమభవన్ లో గురువారం జరిగింది.సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, ఐఎఎస్ అధికారులు విజయ్ కుమార్,యోగితారాణ,క్రిస్టియానా చోంగ్తూ,డిఐజి శ్రీనివాస్ రావు,ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్,దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అట్రాసిటీ చట్టాలు దేశంలో మరెక్కడా  లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్నాయని, వీటిని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలని కోరారు.ఈ చట్టాలను అమలు చేస్తున్న తీరు, బాధితులకు పరిహారంగా సుమారు 100 కోట్ల రూపాయలు అందించడం పట్ల కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలే ప్రశంసించడాన్ని గుర్తు చేశారు.బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని,వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలన్నారు.


బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పారు. డిఎస్పీలు త్వరితగతిన విచారణ పూర్తి చేసి, ఛార్జీషీటు వేసేట్టు చూడాలని అధికారులకు సూచించారు. చట్టాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు జిల్లాలలోని పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు,న్యాయస్థానాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల 30వ తేదీన జిల్లాలలో నిర్వహించే పౌర హక్కుల పరిరక్షణ దినోత్సవానికి కలెక్టర్, ఎమ్మెల్యేలు,ఎస్పీ తదితర అధికారులు తప్పకుండా హాజరయ్యే విధంగా తగు ఆదేశాలివ్వాలన్నారు. పోలీసు శాఖలో కొత్తగా చేరే అధికారులకు ఈ చట్టాల గురించి శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

Updated Date - 2022-01-07T00:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising