Koppula Eshwar: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీకి ఏం సంబంధం?
ABN, First Publish Date - 2022-09-14T19:45:34+05:30
సెప్టెంబర్ 17న రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి కొంత మంది కేంద్రమంత్రులు వస్తున్నారని... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీకి ఏం సంబంధమో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
హైదరాబాద్: సెప్టెంబర్ 17న రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి కొంత మంది కేంద్రమంత్రులు వస్తున్నారని... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీ (BJP)కి ఏం సంబంధమో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ పరమైన అంశాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలపై బీజేపీ నేతల (BJP Leaders)కు కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రాష్ట్రంలో దళిత బంధుకు డబ్బులు లేవని వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అనుమానం ఉంటే నియోజకవర్గానికి వెళ్లి తెలుసుకోవచ్చని అన్నారు. పూర్తి స్థాయిలో లబ్ది దారులకు అందరికీ దళిత బంధు అందిస్తామని స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకలకు సీఎం హాజరు కాకపోవడంపై ప్రతి పక్షాల విమర్శలు అర్థం లేనివని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
Updated Date - 2022-09-14T19:45:34+05:30 IST