ధాన్యం సేకరణ స్థితిగతులపై మంత్రి హరీశ్ రావు సమావేశం
ABN, First Publish Date - 2022-06-24T22:16:11+05:30
తెలంగాణలో ధాన్యం సేకరణ స్ధితిగతులపై ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణ స్ధితిగతులపై ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ రైతుబంధు ఛైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధాన్యంసేకరణకు సంబంధించి ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సేకరణకు సంబంధించి ఇతర అంశాలనుకూడా వెంటనే అందజేయాలన్నారు.ధాన్యం సేకరణ పరిస్థితులపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Updated Date - 2022-06-24T22:16:11+05:30 IST