సిద్దిపేట తరపున యాదాద్రికి రెండు కిలోల బంగారం: మంత్రి హరీష్ రావు
ABN, First Publish Date - 2022-02-03T21:40:58+05:30
సిద్దిపేట నియోజకవర్గం తరపు నుంచి యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం ఇస్తున్నట్లు
యాదాద్రి: సిద్దిపేట నియోజకవర్గం తరపు నుంచి యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం ఇస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. విమాన గోపురం స్వర్ణ తాపడానికి కిలో బంగారం ఇచ్చామని, మరో విడతగా ఇంకో కిలో బంగారం సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. విమాన గోపురానికి 1 కిలో బంగారం అందజేశారు. అనంతరం ప్రధానాలయం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరమన్నారు. రాష్ట్రంలోనే రాబోయే రోజుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయం విరాజిల్లబోతోందన్నారు. యాదాద్రిలో వంద పడకల ఆస్పత్రి కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత కోరిన విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2022-02-03T21:40:58+05:30 IST