ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాయం పేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం పై మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2022-04-08T20:27:45+05:30

హనుమకొండ జిల్లా, శాయంపేట మండలం, మందారపేట కస్తూర్బా పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: హనుమకొండ జిల్లా, శాయంపేట మండలం, మందారపేట కస్తూర్బా పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో మరో 8 మందికి తీవ్రగాయాలు కావడం పట్ల తీవ్ర విచారం విచారం వ్యక్తం చేశారు.క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.మృతులు మంజుల (45), రేణుక (48), విమల (50) కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కాగా,శాయంపేట మండలం పత్తిపాక నుంచి మొగుళ్లపల్లికి మిరపతోట పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.

Updated Date - 2022-04-08T20:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising