ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అప్రతిహత అభివృద్ధి

ABN, First Publish Date - 2022-02-07T20:28:21+05:30

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో అప్రతిహతంగా అభివృద్ధి జరుగుతోందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామజిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో అప్రతిహతంగా అభివృద్ధి జరుగుతోందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.జనగమకు సీఎం కెసిఆర్ రాక, బహిరంగ సభ సందర్భంగా వరంగల్ జిల్లా రాయపర్తి లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో అప్రతహతి అభివృద్ధి ప్రతి గ్రామానికి కోట్ల కొద్ది నిధులు వచ్చాయని అన్నారు.


గతంలో మంచినీటికి కూడా గతి లేదు.ఇప్పుడు గ్రామాలకు అన్ని మౌలిక వసతులు కలిగాయి. గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయని అన్నారు. రాష్ట్రానికి అనేక అవార్డులు వస్తూనే ఉన్నాయి.వచ్చే మార్చి నుంచి స్థలాలు ఉన్న అర్హులైన వాళ్లకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.వచ్చే మూడేండ్ల లో దళితులు అందరికీ దళిత బంధురాజ్యాంగాన్ని సవరించాలనడం నేరం కాదని అన్నారు. కావాలని కొందరు కల్పిత వివాదం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాంటి వాటిని టిఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. 


రైతుకు ఇంతగా చేసిన ప్రభుత్వం దేశంలో ఉందా?రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి, తోక ముడిచినది ఎవరు?కరెంట్ ను కూడా ప్రైవేట్ పరం చెయ్యాలని చూసింది ఎవరు?కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నది.అయినా సీఎం కేసిఆర్ ఎంతో అద్భుతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తున్నారని మంత్రి కొనియాడారు.కనీవినీ ఎరగని రీతిలో మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని,ఇవన్నీ వివరించడానికే సీఎం కెసిఆర్ జనగామ సభ పెడుతున్నారని చెప్పారు. ఆ సభను సూపర్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత అందరి పై వుందన్నారు. పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా కదలి రావాలని,అత్యధిక పార్టీ సభ్యత్వం ఉన్నటీఆర్ఎస్ ఇంటి పార్టీగా నిరూపించుకోవాలన్నారు. టిఆర్ఎస్ పవర్ ఏంటో చూపించాలని, జనగామ సభ ప్రతిపక్షాలకు సవాల్ గా నిలవాల అన్నారు. 

Updated Date - 2022-02-07T20:28:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising