ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ సీనియర్ల భేటీలో హైడ్రామా

ABN, First Publish Date - 2022-03-20T20:39:16+05:30

కాంగ్రెస్ సీనియర్ల భేటీలో హైడ్రామా నెలకొంది. అశోక హోటల్‌కు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కాంగ్రెస్ సీనియర్ల భేటీలో హైడ్రామా నెలకొంది. అశోక హోటల్‌కు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, మానవతా రాయ్ వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న నేతలతో ఐక్యంగా పనిచేద్దామని అద్దంకి దయాకర్ దండం పెట్టికోరారు. ఇక్కడ రాద్ధాంతం వద్దంటూ వెళ్లిపోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు మీకు తెలియదని చెప్పారు. ఆ తర్వాత జగ్గారెడ్డితో అద్దంకి దయాకర్‌ సమావేశమయ్యారు. 


ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్ల సమావేశం అయ్యారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలందరూ భేటీ అయ్యారు. ఇప్పటికే ఓ మారు మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు. ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి, మానిక్కం ఠాగూర్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రేవంత్‌ను తొలగించి మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పీసీసీ ఇవ్వాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల సమావేశంపై హైకమాండ్ సీరియస్ అయింది. ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు సీనియర్ నేతలకు ఫోన్ చేశారు. ఏమైనా సమస్య ఉంటే నేరుగా సోనియా, రాహుల్‌ గాంధీలకు చెప్పాలని సూచించారు.

Updated Date - 2022-03-20T20:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising