Medchal: పల్లెప్రగతిలో రసాభాస
ABN, First Publish Date - 2022-06-06T19:15:49+05:30
జిల్లాలోని మూడు చింతలపల్లి మండలంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో రసాభాస జరిగింది.
మేడ్చల్: జిల్లాలోని మూడు చింతలపల్లి మండలంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో రసాభాస జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. కాగా సభలో ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హరివర్ధన్ రెడ్డి ప్రసంగిస్తూ ఉండగా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు హరివర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి షామీర్పేట్ పోలీస్స్టేషన్కు తరలించారు.
Updated Date - 2022-06-06T19:15:49+05:30 IST