మేడారం జాతరలో పోలీసులు, అధికారుల మధ్య సమస్వయ లోపం
ABN, First Publish Date - 2022-02-18T14:47:02+05:30
మేడారం మహాజాతర నిర్వహణలో పోలీసులు, అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తింది.
ములుగు: మేడారం మహాజాతర నిర్వహణలో పోలీసులు, అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తింది. మేడారం జాతరలో అనుభవం లేని ఐపీఎస్ అధికారులతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త ఐపీఎస్ అధికారులు జాతరను పూర్తిగా కమాండ్ చేస్తున్నారు. వారి అతి ఉత్సాహంతో భక్తులు, స్థానిక పోలీస్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడారం - పస్రా మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Updated Date - 2022-02-18T14:47:02+05:30 IST